Header Banner

అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు! ఎలా దరఖాస్తు చేసుకోవాలి!

  Wed May 28, 2025 17:43        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు "అన్నదాత సుఖీభవ" పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు లబ్ధిపొందనున్నారు. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి అనుబంధంగా రూపొందించబడింది. పీఎం కిసాన్ కింద వచ్చే రూ.6,000కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 మంజూరు చేయడంతో రైతులకు మొత్తం రూ.20,000ల పెట్టుబడి సాయం లభిస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్‌గా జమ చేస్తారు.

 

ఈ పథకానికి అర్హులైన వారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 18 సంవత్సరాలు పైబడిన చిన్న, సన్నకారు భూస్వాములు మరియు ధ్రువీకరిత కౌలు రైతులు కావాలి. ఆధార్ కార్డు, భూమి పత్రాలు, బ్యాంక్ వివరాలు, మొబైల్ నంబర్ వంటి పత్రాలు తప్పనిసరి. పీఎం కిసాన్‌కు అర్హత ఉన్న రైతులు ఈ పథకానికి కూడా అర్హులు. అయితే ఆదాయపన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రూ.10,000 పింఛన్ పైగా పొందేవారికి ఈ పథకం వర్తించదు. ఈ పథకాన్ని కుటుంబ యూనిట్ ప్రాతిపదికన అమలు చేస్తారు, అంటే ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది.

 

ఇది కూడా చదవండి: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! వరి, పత్తి సహా 14 రకాల పంటల మద్దతు ధర పెంపు!

 

రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే తమ సమీప రైతు సేవా కేంద్రంలో అవసరమైన పత్రాలతో కలిసి వెళ్లి నమోదు చేసుకోవాలి. అక్కడి అధికారులు పత్రాలను ధృవీకరించి, లబ్ధిదారుల జాబితాలో రైతుని చేర్పిస్తారు. దరఖాస్తు స్టేటస్‌ను అధికారిక వెబ్‌సైట్ [https://annadathasukhibhava.ap.gov.in](https://annadathasukhibhava.ap.gov.in) ద్వారా తెలుసుకోవచ్చు. 2025కు సంబంధించిన దరఖాస్తుల గడువు మే 25గా నిర్ణయించబడింది. ఈ పథకం ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించి వ్యవసాయంలో వారి స్థిరత్వాన్ని, ఉత్సాహాన్ని పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యం.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?


గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక! ప్రమాదకరమైన లోపాలు గుర్తింపు!


వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!


విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!


తీపి క‌బురు చెప్పిన ఫ్లిప్‌కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భ‌ర్తీ!


కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు! నాని కుటుంబ సభ్యులు!


కేటీఆర్‌కు ఏసీబీ షాక్..! నోటీసులు జారీ!


విశాఖ విమ్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాతపరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #AnnadataSukhibhava #APFarmers #ChandrababuNaidu #TDPGovt #FarmerSupport #RythuBhadratha #APAgriculture